Ayodhya: అయోధ్య రామయ్య కోసం ముప్పై సంవత్సరాలుగా మౌన వ్రతంలో ఉన్న మహిళ.. ఆమె ఎవరో తెలుసా?

by Disha Web Desk 10 |
Ayodhya: అయోధ్య రామయ్య కోసం ముప్పై సంవత్సరాలుగా మౌన వ్రతంలో ఉన్న మహిళ.. ఆమె ఎవరో తెలుసా?
X

దిశ,ఫీచర్స్: జార్ఖండ్ కు చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవి అగర్వాల్ కల నెరవేరబోతుంది.దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె మౌన వ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తన మౌన వ్రతాన్ని వీడతానని 1992 లో ఆమె ప్రతిజ్ఞ చేసింది. జనవరి 22 న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె కల నెరవేతుంది. జార్ఖండ్ లోని ధనబాద్‌కు చెందిన మహిళ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మౌన ముద్రలోకి వెళ్ళిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజే తన మౌన వ్రతాన్ని వీడనున్నట్లు.. ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ పూనింది.

మౌనీ మాతగా పేరు గాంచిన సరస్వతి దేవి తన కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనీకెట్ చేసేది. కొన్ని సందర్భాలలో పేపర్ పై భారీ వ్యాఖ్యలు రాసి ఇచ్చేది. అయితే, 2020 లో ప్రధాన మోదీ అయోధ్యలో శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఆమె రోజంతా మౌనంగా ఉండటం ప్రారంభించింది. 1986 దేవకీ నందన్ అగర్వాల్ మృతి తర్వాత సరస్వతి దేవి తర్వాత ఆమె తన జీవితాన్ని రాముడికి అంకితం చేసింది. రాములోరి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనున్నట్లు ఆమె కుమారుడు 55 ఏళ్ల హ‌రే రామ్ అగ‌ర్వాల్ తెలిపారు.

Next Story