- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. DA నాలుగు శాతం పెంపు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది.

X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4 శాతానికి పెంచింది. కాగా ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. DA అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి ఆదాయాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి చెల్లించే జీతంలో ఒక భాగం. ఇది ఉద్యోగి యొక్క ప్రాథమిక జీతంలో ఒక శాతంగా లెక్కించబడుతుంది. కాగా పెరిగిన అలవెన్స్ తర్వాత డీఏ 42 నుంచి 46 శాతానికి పెరిగింది. దసరా పండగ కానుకగా కేంద్ర కేబినెట్ నిర్ణయంతో దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






