- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర్నాథ్ యాత్రకు ముహుర్తం ఫిక్స్..ఎప్పటి నుంచంటే
జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో గల అమర్నాథ్ యాత్ర జూలై మూడో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: అమర్నాథ్ యాత్రకు ( Amarnath Yatra) వెళ్లే వారికి అలర్ట్. అమర్నాథ్ యాత్రకు షెడ్యూల్ ఖరారైంది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో గల అమర్నాథ్ యాత్ర జూలై మూడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగియనుంది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారిక ప్రకటన చేశారు.
శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహించనున్నారు. ఇక ఈ అమర్నాథ్ యాత్ర కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు 13 ఏళ్లు పైబడిన వాళ్లను మాత్రమే అనుమతి ఇస్తారు. అటు 70 సంవత్సరాలు దాటిన వారికి పర్మిషన్ లేదన్న సంగతి తెలిసిందే.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ?
ఇండియా వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్, జమ్మూ కాశ్మీర్ బ్యాంకులకు ఉన్న శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తుగా నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఇలా మొత్తం 554 గుర్తింపు పొందిన శాఖల ద్వారా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
యాత్రికులకు మార్గదర్శకాలు
అమర్నాథ్ బోర్డు నిబంధనల ప్రకారం 13 - 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ యాత్రకు అర్హులవుతారు. యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరు హెల్త్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. సేఫ్టీ నేపథ్యంలో ప్రతి భక్తుడికి RFID కార్డు పక్కా చేశారు.






