'ది కేరళ స్టోరీ' సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

by Disha Web Desk 12 |
ది కేరళ స్టోరీ సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న 'ది కేరళ స్టోరీ' సినిమా మే4న దేశవ్యాప్తంగా విడుదలైంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతం లోకి ఎలా మారారు, వారిని ఐసిస్ ఏ విధంగా రిక్రూట్ చేసుకున్నారని ఈ చిత్రం పేర్కొంది. దీంతో ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్ను రహితంగా ప్రకటించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో సందేశంలో ప్రకటించారు. జిహాద్, మత మార్పిడి, తీవ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read..

న్యూసెన్స్ : స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుడి హస్తం.. బలమున్నోడికి మొక్కాలా?

Next Story