మద్యం తాగి నిద్రపోయిన భర్త.. ప్రియుడితో భార్య ఉండటాన్ని చూసి..

by Disha Web Desk 4 |
మద్యం తాగి నిద్రపోయిన భర్త.. ప్రియుడితో భార్య ఉండటాన్ని చూసి..
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలోని రాయ్ బరేలీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ ఘటన బచ్రావన్ పీఎస్ పరిధితోని తులేహండి గ్రామంలో చోటు చేసుకుంది. మార్చి 30న భర్త తన భార్య, ప్రేమికుడితో కలిసి మద్యం సేవించాడు. అనంతరం భర్త నిద్రపోయాడు. ఆ తర్వాత భార్య, ప్రియుడి మధ్య గొడవ మొదలైంది. అరుపులు వినిపిస్తుండటంతో భర్తకు మెలకువ వచ్చింది.

ఆ సమయంలో అతను తన భార్యను అభ్యంతరకరమైన స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. వారిద్దరిపై కోపంతో ఊగిపోయాడు. దీంతో భార్య, ప్రియుడు భర్తను హత్య చేశారు. ఘటనకు ముందు మహిళ తన ప్రియుడితో కలిసి భర్తకు మద్యం తాగించింది. ఆ తర్వాత భర్త నిద్రలోకి జారుకోవడంతో ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు. రాయ్ బరేలీ పోలీసు అధికారి నవీన్ సింగ్ మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపట్టాం.

మృతుడి బంధువులను విచారించే క్రమంలో గ్రామానికి చెందిన వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మహిళను పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఘటన జరిగిన రోజు భర్త, ప్రియుడు తాను మద్యం సేవించినట్లు తెలిపింది. తన భర్త లేచి చూసేసరికి అభ్యంతకర స్థితిలో ఉండగా ఆగ్రహించినట్లు తెలిపింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Next Story

Most Viewed