పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: మమతా బెనర్జీ

by Dishanational2 |
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సామాన్య ప్రజలకు టీఎంసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతంలో పార్టీ శ్రేణులందరి కృషి ఉందని గుర్తు చేశారు. ఏ శక్తికీ టీఎంసీ లొంగిపోదని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ప్రజల తరఫున నిలుస్తామని, పోరాటాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, 1998 జనవరి 1న టీఎంసీ ఏర్పడింది. అప్పటి నుంచి బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.


Next Story