ముక్కుపచ్చలారని చిన్నారికి విషమిచ్చిన కన్నతండ్రి..

by Disha Web Desk 1 |
ముక్కుపచ్చలారని చిన్నారికి విషమిచ్చిన కన్నతండ్రి..
X

దిశ, వెబ్ డెస్క్ : కలియుగంలో మానవ సంబంధాలు కనుమరుగువున్నాయి. క్షణికావేశంలో చేసిన తప్పులకు నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. భార్యపై అనుమానంతో పసికందుకు కన్న తండ్రే పురుగుల మందు ఎక్కించిన ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... చందన్, తన్మయి దంపతులకు ఈ నెల 9 న పండంటి ఆడపిల్ల పుట్టింది. అయితే, భార్య వివాహేతర సంబంధం వల్లే గర్భం దాల్చిందంటూ అనుమానంతో చందన్‌ రగిలిపోయాడు. దీంతి మానవ మృగంలా మారిన చందన్ తన భార్య వేరే గదిలో ఉండగా, ముక్కుపచ్చలారని చిన్నారికి సిరంజితో పురుగల మందును ఎక్కించాడు. గమనించిన భార్య చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Next Story