ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన రైతులు

by Dishafeatures2 |
ప్రభుత్వ హామీతో  ఆందోళన విరమించిన రైతులు
X

దిశ, వెబ్ డెస్క్: హర్యాణాలోని కురుక్షేత్ర వద్ద దీక్ష చేస్తున్న రైతులు తమ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర కల్పించాలంటూ కొన్ని రోజులుగా హర్యాణాలోని కురుక్షేత్ర వద్ద రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అక్కడి ప్రభుత్వం రైతు నేతలతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్ధతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు తమ దీక్షను విరమించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం రైతు నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. కనీస మద్ధతు ధర ప్రకటించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed