- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరిగిన ‘రెడ్ కారిడార్’ కల.. మారుతున్న అబూజ్మడ్ అడవుల మఖచిత్రం
తిరుపతి నుంచి నేపాల్లోని పశుపతినాథ్ వరకు ఎర్ర జెండా ఎగురవేయాలన్న మావోయిస్టుల కల కరిగిపోయింది.

దిశ, వెబ్డెస్క్: ఒకప్పుడు ‘నక్సల్ రహిత భారత్’ (Naxal-free India) అనేది కేవలం ఒక ఆశగా మాత్రమే మిగిలిపోయింది. మందుపాతరలతో నిండిన రహదారులు, అడుగుపెట్టలేని దట్టమైన అడవులు, భయం నీడలో బ్రతికే జిల్లాలు.. ఇదీ ఒకప్పటి ‘రెడ్ కారిడార్’ (Red Corridor). కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 గడువు సమీపించిన వేళ క్షేత్రస్థాయిలో నక్సలిజం పూర్తిగా కనుమరుగైపోయింది.
నియంత్రణ నుంచి నిర్మూలన వరకు
బస్తర్, బీజాపూర్.. ఇలా ఒకప్పుడు ఎవరికీ సాధ్యం కాని అబూజ్మఢ్ అడవుల్లో పర్యటించినప్పుడు, రాజకీయ సంకల్పం, భద్రతా బలగాల వ్యూహాత్మక పటిష్టత స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం నియంత్రణ (Containment) కాదు, ముగింపు (Conclusion) దిశగా సాగుతున్న పయనమని కేంద్ర ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ వంటి భారీ దాడుల ద్వారా కర్రెగుట్ట వంటి నక్సల్ స్థావరాలను బలగాలు ధ్వంసం చేశాయి. ఆయుధ తయారీ కేంద్రాలు, బాంబు నిల్వలు ఉన్న గుహలను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టుల నైతిక బలం, కదలికలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కుచించుకుపోయిన ‘రెడ్ కారిడార్’
తిరుపతి నుంచి నేపాల్లోని పశుపతినాథ్ వరకు ఎర్ర జెండా ఎగురవేయాలన్న మావోయిస్టుల కల కరిగిపోయింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సల్ కార్యకలాపాల క్రమంగా పతనావస్థకు చేరుకున్నాయి. అగ్రశ్రేణి నాయకులు చాలామంది హతం అవ్వడం, కొందరు ఆయా రాష్ట్రాల పోలీసు ఎదుట మావోయిస్టు పార్టీ (Maoist Party) బలహీనపడింది. గత దశాబ్ద కాలంతో పోలిస్తే హింసాత్మక ఘటనలు 50 శాతం పైగా తగ్గాయి. భద్రతా బలగాల ప్రాణనష్టం 75 శాతం, పౌరుల మరణాలు 70 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. కేవలం తుపాకులతోనే ఈ మార్పు రాలేదు. వ్యూహాత్మకమైన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (FOB) ల ఏర్పాటు ద్వారా బలగాలు అడవుల్లో శాశ్వత స్థావరాలను ఏర్పరుచుకున్నాయి. డ్రోన్ల నిఘా, అత్యాధునిక సాయుధ వాహనాలు భద్రతను పెంచాయి.
శాంతి కోరుకుంటున్న మాజీలు
అబూజ్మఢ్లో కలిసిన మాజీ నక్సల్స్ మాటల్లో కాస్త నిరాశ ప్రశాంతమైన జీవితం పట్ల ఆశ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా బలగాల ఒత్తిడి ఉందని, తమకు జనజీవన స్రవంతిలోకి వెళ్లి బ్రతకాలని ఉందని కొందరు చెబుతున్నారు. మరికొందరు ఏ పోరాటమైనా ప్రజల మధ్యే ఉండి పోరాటం చేస్తామని, రాజకీయంగా ఓ వేదికను ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని అంటున్నారు. అయితే, నక్సలిజం పూర్తిగా అంతమైందని చెప్పడం తొందరపాటే కావచ్చు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల అవశేషాలు ఉన్నాయి. పేదరికం, నిరుద్యోగం వంటి మూల కారణాలను పరిష్కరించాల్సి ఉంది.
తుపాకుల స్థానంలో తరగతి గదులు
అయితే, ఒకప్పుడు అంతుచిక్కని అడవులుగా పేరుగాంచిన ప్రాంతాలు నేడు అభివృద్ధి పథంలోకి వస్తున్నాయి. తుపాకులు గర్జించిన చోట ఇప్పుడు పాఠశాల గంటలు వినిపిస్తున్నాయి. బీజాపూర్లోని గుండం వంటి గ్రామాల్లో ఒకప్పుడు ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. అక్కడ కొత్తగా పాఠశాలలు, ఆసుపత్రులు, రేషన్ షాపులు వెలిశాయి. ‘బస్తర్ ఫైటర్స్’ (Bastar Fighters) వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు వారినే భద్రతా వ్యవస్థలో భాగస్వాములను చేశారు. మరోవైపు క్రీడల ద్వారా గిరిజన యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.






