ఉచిత విమాన పథకం.. జెండా ఊపీ మొదటి బ్యాచ్ యాత్రికులను పంపిన సీఎం..

by Disha Web Desk 12 |
ఉచిత విమాన పథకం.. జెండా ఊపీ మొదటి బ్యాచ్ యాత్రికులను పంపిన సీఎం..
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉచిత విమాన పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఉచిత విమాన పథకం కింద తమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి భోపాల్ నుండి 32 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ పథకం ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్స్ అయిన యాత్రికులకు అనుమతి లభించింది. దీంతో మొదటి బ్యాచ్ లో ప్రయాణం చేసిన యాత్రికులు.. ఈ అవకాశం కల్పించిన సీఎంకు ధన్యవాదాలు.. విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి’’ అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఉచిత విమాన పథకం రాబోయే రోజుల్లో మరింత మందిని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

Also Read...

భారత ప్రధాని మోడీని ఆటో గ్రాఫ్ అడిగిన అమెరికా అధ్యక్షుడు బైడెన్


Next Story

Most Viewed