టైగర్ హబ్ గా భారత్.. ప్రపంచంలో 75 శాతం పులులు మన దగ్గరే

by Dishafeatures2 |
టైగర్ హబ్ గా భారత్.. ప్రపంచంలో 75 శాతం పులులు మన దగ్గరే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో అత్యధిగా పులులు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని మొత్తం పులులలో ఒక్క భారత్ లోనే 75 శాతంలో ఉన్నాయని తెలిపింది. ఇక పులుల జనాభాలో భారత్ లో 785 పులులతో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని, ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (563), ఉత్తరాఖండ్ (560), మహారాష్ట్ర (444) ఉన్నాయని పేర్కొంది. టైగర్ రిజర్వ్‌లో అత్యధికంగా కార్బెట్ (260), బందీపూర్ (150), నాగర్‌హోల్ (141), బాంధవ్‌ఘర్ (135), దుధ్వా (135), ముదుమలై (114), కన్హా (105), కాజిరంగా (104), సుందర్బన్స్ (100), తడోబా (97), సత్యమంగళం (85), మరియు పెంచ్-MP (77) ఉన్నాయని తెలిపింది.

Next Story

Most Viewed