పీవోకే ముమ్మాటికి మాదే.. లోక్ ‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
పీవోకే ముమ్మాటికి మాదే.. లోక్ ‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా బుధవారం జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు, రిజర్వేషన్ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిల్లులపై అమిత్ షా ప్రసంగిస్తూ.. మేము తీసుకొచ్చిన ఈ బిల్లు ఎవరికి వ్యతిరేకంగా తేలేదని, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడమే తమ ఉద్దేశం అన్నారు. కొత్త చట్టం ప్రకారం కశ్మీర్‌కు 47, జమ్ముకు 43 అసెంబ్లీ సీట్లు ఉండబోతున్నాయి. పీవోకేలో 24 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసింది. గతం కంటే కశ్మీర్‌లో ఒకటి, జమ్ములో 7 సీట్లు వచ్చాయి. కొత్త కోటా ప్రకారం పండిట్లకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించారు.



Next Story

Most Viewed