GST కౌన్సిల్ మీటింగ్: రాష్ట్రాలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం

by Disha Web Desk 19 |
GST కౌన్సిల్ మీటింగ్: రాష్ట్రాలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం మాట్లాడిన నిర్మలా సీతారామన్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. జూన్‌కు సంబంధించి రూ.16, 982 కోట్ల బకాయిలు ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పెన్సిల్, షార్ప్‌నర్లపై జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే జీపీఎస్ పరికరాలు, లిక్విడ్ బెల్లంపై జీఎస్టీ తగ్గించామన్నారు. పాన్ మసాలా, గుట్కా పరిశ్రమలు పన్ను ఎగవేస్తున్నట్లు మంత్రుల బృందం మండలిలో ప్రస్తావించిందని దీనిపై చర్చించామన్నారు.

Also Read...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టేషనరీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Next Story

Most Viewed