ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి

by Disha Web Desk 2 |
ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను నాలుగు శాతం మేర పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో 48.67 లక్షల ఉద్యోగులకు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బేసిక్ పేపై 46 శాతం డీఏ పొందుతుండగా అది 50 శాతానికి పెరగనుంది. దీంతో ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ శుభవార్త మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహద పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


Next Story