“దేశవ్యాప్తంగా ఉగ్రవాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయి: ధీరేంద్ర కృష్ణ శాస్త్రి

by Malleboina Mahesh |

బగేశ్వర్‌ ధామ్ అధిపతి ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేస్తున్న పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. హరియాణా రాష్ట్రంలోని పల్‌వాల్‌లో నిర్వహించిన పదయాత్రలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి.

“దేశవ్యాప్తంగా ఉగ్రవాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయి: ధీరేంద్ర కృష్ణ శాస్త్రి
X

దిశ, వెబ్ డెస్క్: బగేశ్వర్‌ ధామ్ అధిపతి ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేస్తున్న పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. హరియాణా రాష్ట్రంలోని పల్‌వాల్‌లో నిర్వహించిన పదయాత్రలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇది మన పదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. ఇది సామాజిక ఐక్యత, హిందూ ఏకత సందేశాన్ని వ్యాప్తి చేస్తోంది. దేశంలో శాంతి నెలకొనాలంటే సనాతన ధర్మం ఆధారంగా అందరూ ఐక్యంగా ఉండాలి,” అని పేర్కొన్నారు. అలాగే, ఢిల్లీ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ప్రస్తావిస్తూ.. “దేశవ్యాప్తంగా ఉగ్రవాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయి.

దేశం మొత్తంలో సనాతనీ ప్రజలు 16వ తేదీన వృందావనానికి రావాలి, లేనిపక్షంలో ప్రతి ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరుగుతాయి,” అంటూ హెచ్చరికల తరహాలో వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. శాంతి, సామాజిక ఐక్యత పేరుతో చేసిన ఈ వ్యాఖ్యల్లో భయాందోళనలు సృష్టించే అంశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా వ్యవస్థలు, మీడియా వర్గాలు ఇలాంటి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటూ వాస్తవ పరిస్థితులపై స్పష్టత కోసం అధికారిక సమాచారాన్ని ఎదురుచూస్తున్నాయి. అధికారులు ఇప్పటివరకు ఢిల్లీ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story