పుల్వామా ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Disha Web Desk 10 |
పుల్వామా ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

శ్రీనగర్: భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామాలో కశ్మీర్ పండిట్‌ను చంపిన ఉగ్రవాది కూడా వీరిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పుల్వామాలోని పద్గంపొరా గ్రామంలో మంగళవారం పోలీసులు, ఉగ్రవాదులు సంయుక్తంగా చేపట్టిన అపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. మరణించిన వారిలో పుల్వామా నిందితుడు ఆకీబ్ ముస్తాక్ గుర్తించామని జమ్ముకశ్మీర్ పోలీస్ ట్వీట్ చేశారు. గతంలో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రసంస్థకు పనిచేశాడని తెలిపారు. అర్థరాత్రి తర్వాత ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా ఘటన స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత వారం సంజయ్ శర్మ అనే కశ్మీర్ పండిట్‌ను మార్కెట్ సమీపంలో ఉగ్రవాదుల కాల్చి చంపిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed