- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్మూజ్ జలసంధిలో తగ్గని ఉద్రిక్తతలు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు రెట్టింపు
హోర్ముజ్ జలసంధిలో ఇంధన సరఫరాలో అంతరాయాల కారణంగా భారత్ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది.

దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా భారత్ (India) తన వ్యూహాన్ని మార్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో భారత్ మళ్లీ రష్యా వైపు మొగ్గు చూపుతోంది. జనవరి నెలతో పోలిస్తే రష్యా (Russia) నుంచి ముడి చమురు దిగుమతులు ఏకంగా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దిగుమతుల్లో 40 శాతం రష్యాదే..
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతానికి చేరుకోనుంది. సాధారణంగా భారత్ తన చమురు అవసరాల కోసం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈలపై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే, హర్మూజ్ జలసంధి గుండా రవాణా కష్టతరం కావడంతో రష్యా నుంచి తక్కువ ధరకే లభించే చమురు భారత్కు ఊరటనిస్తోంది. అయితే, గతంలో రష్యన్ చమురుపై ఆంక్షలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా చమురు ధరలను కంట్రోల్ చేసేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం 30 రోజుల పాటు మినహాయింపువ్వగా అది భారత్కు పూర్తిగా కలిసొచ్చింది. మార్చి 19న భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri), రష్యా డిప్యూటీ ఇంధన మంత్రి పావెల్ సోరోకిన్ (Pavel Sorokin) మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా నుంచి కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, నేరుగా ఎల్ఎన్జీ విక్రయాలను కూడా పునరుద్ధరించే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి.






