ఢిల్లీ - విశాఖ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..!

by Ramesh Naini |   (  Updated:2025-10-24 13:37:21  IST  )

ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.

ఢిల్లీ - విశాఖ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే (Air India flight) ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి బయలుదేరిన AI-451 విమానంలో పైలట్‌ పవర్‌ యూనిట్‌ షట్‌డౌన్‌ అయినట్లు గుర్తించారు. దీంతో జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించినట్లు తెలిసింది.

సాయంత్రం 5.20 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా మధ్యలోనే తిరిగి వెళ్ళిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని సమాచారం అందింది. విమానాన్ని పరిశీలించేందుకు ఎయిర్‌ ఇండియా సాంకేతిక బృందం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ట్వీట్..

Next Story