- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్.. క్షతగాత్రుల వైద్య ఖర్చులూ భరిస్తామని ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు టాటా గ్రూప్(Tata Group) ప్రకటించింది.

దిశ, వెబ్డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు టాటా గ్రూప్(Tata Group) ప్రకటించింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్(Chandrasekaran) ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇది చాలా విషాదకరమైన ఘటన. మా బాధ వర్ణనాతీతం. క్షతగాత్రుల వైద్య ఖర్చలు కూడా తామే మొత్తం భరిస్తాం. ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీకి కొత్త భవనం కట్టిస్తామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు. కాగా, అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా మృతిచెందారు. ఈ ఘటన మొత్తం దేశాన్ని కలిచివేసింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను ఎంతగానో కలచి వేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.






