సోనియా, రాహుల్ గాంధీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్

by Disha Web Desk 2 |
సోనియా, రాహుల్ గాంధీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫోన్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోవడమే కాకుండా.. దాదాపు విజయం ఖరారు కావడంతో స్టాలిన్ వారికి శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకూ ఫోన్ చేసిన శుభాకాంక్షలు చెప్పారు స్టాలిన్.

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. హస్తం పార్టీ అధికారం చేపట్టడమే ఇక లాంఛనమే. అయితే కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అలాగే కీలకంగా మారుతుందనుకున్న జేడీఎస్ కూడా 37 స్థానాల నుంచి 21 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుతం ఫలితాలను చూస్తే బీజేపీ, జేడీఎస్‌కు కలిపి 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటే కాంగ్రెస్ హవా అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలకు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read More... కర్ణాటక రిజల్ట్స్ : రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే!



Next Story

Most Viewed