రాష్ట్రపతికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ.. ఆ బిల్లుకు ఆమోదం తెలపాలని వినతి

by Dishafeatures2 |
రాష్ట్రపతికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ.. ఆ బిల్లుకు ఆమోదం తెలపాలని వినతి
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ మినహాయింపు బిల్లుకు ఆమోదం తెలపాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తమిళనాడు ప్రజల సమిష్టి అభిప్రాయం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల బిల్లు, 2021ని రూపొందించామని, దానికి తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ బిల్లును అమలులో జాప్యం వల్ల వైద్య సీట్లను కోల్పోవడమే కాకుండా అనేక మంది విద్యార్థులు తమ విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. కాగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని జగదీశ్వర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక అతడి తండ్రి సెల్వ శేఖర్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.



Next Story

Most Viewed