ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

by Disha Web Desk 2 |
ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల్లో 370 ఆర్టికల్ రద్దు ఒకటి. ఈ అంశం దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇష్యూపై పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా.. ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. వేర్వేరు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.

ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు విచారణ జరిపింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed