వచ్చే నెలలో ఎస్ఐఆర్‌పై సుప్రీం కోర్టు విచారణ

by Phanindra |

వచ్చే నెలలో ఎస్ఐఆర్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పిటిషన్లను షెడ్యూల్ చేసింది.

వచ్చే నెలలో ఎస్ఐఆర్‌పై సుప్రీం కోర్టు విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పలురాష్ట్రాలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై వచ్చే నెలలో విచారణ జరగనుంది. కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై డిసెంబరు 2న, తమిళనాడు పిటిషన్‌పై డిసెంబరు 4న, పశ్చిమ బెంగాల్ వేసిన పిటిషన్‌పై డిసెంబరు 9న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌కు సంబంధించిన కేసులపై కూడా డిసెంబరులోనే విచారణ ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇటీవల ఎస్ఐఆర్ ఒత్తిడి వల్ల పశ్చిమ బెంగాల్‌లో 23 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) మరణించినట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

Next Story