- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవధ నిషేధంపై పిటిషన్.. విచారణకు సుప్రీం నిరాకరణ
గోవధ నిషేధ చట్టం అమలుపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

దిశ, వెబ్డెస్క్: మరో రెండ్రోజుల్లో బక్రీద్ పండుగ ఉన్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదంతా ఊరుకుని, బక్రీద్ పండుగకు ఒక్కరోజు ముందు మీకు ఇది గుర్తుకొచ్చిందా? అని పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు అడ్వకేట్ వరుణ్ కుమార్ సిన్హా ఈ అంశాన్ని ప్రస్తావించారు. "ఎల్లుండి బక్రీద్ పండుగ ఉంది. గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిని రేపటి విచారణ జాబితాలో చేర్చగలరా?" అని లాయర్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ ధర్మాసనం.. "మీకు పండుగకు సరిగ్గా ఒక్క రోజు ముందే ఈ విషయం గుర్తుకొచ్చిందా? ఇందులో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదు. ధన్యవాదాలు" అని వ్యాఖ్యానిస్తూ అత్యవసర విచారణ పిటిషన్ను తిరస్కరించింది.
పిటిషనర్ డిమాండ్లు ఇవే..
అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గోవులు, వాటి సంతతిని వధించకుండా రక్షించేందుకు గోవధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, దేశంలోని ప్రతి రాష్ట్రంలో చట్టప్రకారం కబేళాలను (Slaughterhouses) నియంత్రించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాల్సిందిగా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, పండుగ వేళ తక్షణ ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మొగ్గు చూపలేదు.






