దేశంలోని బార్‌ కౌన్సిళ్ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్

by Ajay Maddhiboyina |

బార్ కౌన్సిళ్ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జ‌న‌వ‌రి 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో బార్ కౌన్సిళ్ల ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒకేసారి కాక‌పోయినా ద‌శ‌ల‌వారీగా ఎన్నిక‌లు జ‌రిగేలా చూసుకోవాల‌ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

దేశంలోని బార్‌ కౌన్సిళ్ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్
X

దిశ‌, వెబ్ డెస్క్: బార్ కౌన్సిళ్ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జ‌న‌వ‌రి 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో బార్ కౌన్సిళ్ల ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒకేసారి కాక‌పోయినా ద‌శ‌ల‌వారీగా ఎన్నిక‌లు జ‌రిగేలా చూసుకోవాల‌ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా త‌ర‌పున హాజ‌రైన సీనియ‌ర్ న్యాయ‌వాదిని కోరింది. బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల‌తో పాటు రూల్ 32పై త‌మిళ‌నాడు బార్ కౌన్సిల్ మెంబ‌ర్ వ‌ర్ధ‌న్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బార్ కౌన్సిల్ ఎన్నిక‌లు పెండింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ, తెలంగాణ‌లోనూ త్వ‌ర‌లోనే బార్ కౌన్సిల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Next Story