- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మోడీ పొదుపు మంత్రం.. కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మోడీ పొదుపు మంత్రానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణ, సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ పై సర్క్యులర్ జారీ చేసింది.

దిశ, వెబ్డెస్క్: ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని బోధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నాయి. సీఎంలు, మంత్రులు తమ కాన్వాయ్ ల్లో వెహికల్స్ సంఖ్యలను తగ్గించుకోవడంతో పాటు.. వారంలో ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ప్రధాని పొదుపు మంత్రం బాటను అవలంబించేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో తలెత్తిన చమురు సంక్షోభం నేపథ్యంలో.. కేంద్రం పొదుపు చర్యలకు మద్దతుగా సుప్రీంకోర్టు పలు సంస్కరణలను ప్రకటించింది. కొన్ని నిర్దిష్ట కేటరిగీల కేసులను తప్పనిసరిగా ఆన్లైన్ విచారణలు చేయాలని నిర్ణయించిది. సోమ, శుక్రవారాల్లో వర్చువల్ హియరింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే జడ్జిలు కార్ పూలింగ్ విధానాన్ని పాటించడం, రిజిస్ట్రీ సిబ్బందిలో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) మే 12, 2026 న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు.
నూతన నిబంధనల ప్రకారం.. సోమవారం, శుక్రవారం లాంటి మిస్ లీనియస్ (Miscellaneous) రోజుల్లో లిస్ట్ అయ్యే అన్ని రకాల కేసులు, అలాగే కోర్టు పాక్షిక పనిదినాల్లో (Partial Working Days) షెడ్యూల్ చేయబడిన కేసుల విచారణలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ (వీడియో లింక్) ద్వారానే నిర్వహించనున్నారు. విచారణల సమయంలో న్యాయమూర్తులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా చూసేందుకు.. రిజిస్ట్రీ విభాగం సమయానికి వీడియో కాన్ఫరెన్స్ లింక్లను పంపాలని, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని మరియు తక్షణ సాంకేతిక మద్దతును అందించాలని సర్క్యులర్లో ఆదేశించారు.
ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తమలో తాము కార్-పూలింగ్ అంటే ఒకే వాహనంలో ప్రయాణించే విధానాన్ని ప్రోత్సహించుకోవాలని న్యాయమూర్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక కోర్టు పరిపాలనా విభాగమైన రిజిస్ట్రీలోని ప్రతి బ్రాంచ్ లేదా సెక్షన్లో పనిచేసే సిబ్బందిలో గరిష్టంగా 50 శాతం మందికి వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, దీనివల్ల కోర్టు రోజువారీ విధులకు ఎలాంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. రిజిస్ట్రీలోని రిజిస్ట్రార్లు అంతా తమ సిబ్బందికి సంబంధించిన వారపు డ్యూటీ రోస్టర్లను (Work Rosters) ముందే సిద్ధం చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు నిరంతరం టెలిఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో కార్యాలయానికి రావాలని ఆదేశిస్తే వెంటనే హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. కేటాయించిన పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతను అధికారులు పర్యవేక్షించాలి. ఏదైనా ఒక నిర్దిష్ట విభాగంలో పని స్వభావాన్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యపడదని భావిస్తే.. ఆయా రిజిస్ట్రీ అధికారులు ఈ డబ్ల్యూఎఫ్హెచ్ (WFH) విధానాన్ని రద్దు చేసే లేదా సవరించే హక్కు ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు.






