కడుపు నొప్పి అని వెళితే.. కిడ్నీ కొట్టేశారు..

by Disha Web Desk 1 |
కడుపు నొప్పి అని వెళితే.. కిడ్నీ కొట్టేశారు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ దళిత మహిళ కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళితే.. రోగి కిడ్నీ మాయం చేసిన ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్ పూర్ నగర్ లో చోటుచేసుకుంది. మథురాపూర్‌కి చెందిన దళిత మహిళ కడుపు నొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానిక శుభ్‌కాంత్‌ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడున్న నకిలీ వైద్యులు ఆమెకు రెండున్నర గంటలు ఆపరేషన్‌ చేసి సుమారు రూ.20 వేలు వసూలు చేశారు. అనంతరం సదరు మహిళను మరో ఆసుపత్రికి తరలించి పరారయ్యాడు. అక్కడి వైద్యులు ఆమె ఓ కిడ్నీకి గురైందని గుర్తించారు. ప్రస్తుతం ఆమె ఎనమిది నెలలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతోంది.


Next Story

Most Viewed