మెస్సి కోల్‌కతా ఇష్యూ.. క్రీడల మంత్రి రాజీనామా

by Muthe.Rajitha |

ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మూడురోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.

మెస్సి కోల్‌కతా ఇష్యూ.. క్రీడల మంత్రి రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మూడురోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మెస్సి కోల్‌కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో అభిమానులు కుర్చీలు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై బెంగాల్‌ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండగా.. నేడు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్‌ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.

స్టేడియంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖను పంపినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తాజాగా రాష్ట్ర డీజీపీ, సీఎస్‌ సహా పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జరిగిన గందరగోళంపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ప్రభుత్వం.

Next Story