కొత్త పార్లమెంటులో వై​సీపీకి నెంబర్ 11 రూమ్‌.. మార్చాలని ఎంపీల డిమాండ్

by Naga Rani Yarlagadda |

కొత్తపార్లమెంటులో వైసీపీ ఎంపీలకు 11వ నంబర్ రూమ్ కేటాయించిన స్పీకర్. అభ్యంతరం తెలిపిన ఎంపీలు. వెంటనే మార్చాలని డిమాండ్.

కొత్త పార్లమెంటులో వై​సీపీకి నెంబర్ 11 రూమ్‌.. మార్చాలని ఎంపీల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్తులో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కోసం స్పీకర్ కార్యాలయం తొలుత 11వ నెంబర్ రూమ్‌ను కేటాయించింది. అయితే.. ఈ నెంబర్ పట్ల ఆ పార్టీ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయింపు జరిగిన వెంటనే స్పందించిన ఎంపీలు, లోక్ సభ స్పీకర్ ను కలిసి ఆ గదిని మార్చాల్సిందిగా కోరారు. స్పీకర్‌తో భేటీ అయి తమకు 11వ నెంబర్ గది ఎందుకు వద్దో సాంకేతిక లేదా సెంటిమెంట్ పరమైన కారణాలను వివరించినట్లు సమాచారం. ఎంపీల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన స్పీకర్ కార్యాలయం.. వెంటనే స్పందించి 11వ నెంబర్ గదికి బదులుగా 12వ నెంబర్ రూమ్‌ను వైఎస్సార్‌సీపీకి కేటాయించింది. దీంతో ఆ పార్టీ ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు.

టీడీపీకి 9వ నెంబర్ గది కేటాయింపు

ఇదే క్రమంలో.. తెలుగుదేశం పార్టీకి (TDP) కూడా కొత్త పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్తులోనే 9వ నెంబర్ రూమ్‌ను స్పీకర్ కార్యాలయం ఇప్పటికే కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండటం గమనార్హం. కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రావడంతో, స్పీకర్ కార్యాలయం అన్ని రాజకీయ పార్టీలకు కార్యాలయాలను కేటాయించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పాత పార్లమెంట్ భవనంలోని పార్టీ కార్యాలయాలను క్రమంగా ఖాళీ చేయిస్తున్నారు. అన్ని పార్టీలకు సదుపాయాలు కల్పించేలా ఎంపీల సంఖ్యకు అనుగుణంగా గదుల కేటాయింపు జరుగుతోంది.

Next Story