పార్టీ సంక్షోభం వేళ శరద్ పవార్ కు సోనియా ఫోన్

by Dishafeatures2 |
పార్టీ సంక్షోభం వేళ శరద్ పవార్ కు సోనియా ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ చర్యలతో తీవ్ర షాక్ లో ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ ఫోన్ లో పరామర్శించారు. రాజకీయంలో ఇవన్నీ సాధారణమని, ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కాగా ఎన్సీపీకి, ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ కు పార్టీ నేత అజిత్ పవార్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనతో పాటు మొత్తం 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరారు.

ఈ క్రమంలోనే ఆయన డిప్యూటీ సీఎం పదవి చేపట్టగా.. ఆయన వర్గంలోని 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక ఊహించని ఈ పరిణామంతో ఎన్సీపీ, పార్టీ చీఫ్ శరద్ పవార్ షాక్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ పోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed