‘ఏడాదిలోగా సిద్ధరామయ్య ప్రభుత్వం పడిపోవడం ఖాయం’

by Disha Web Desk 4 |
‘ఏడాదిలోగా సిద్ధరామయ్య ప్రభుత్వం పడిపోవడం ఖాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కర్ణాటకలో కొలువుదీరిన సిద్ధరామయ్య సర్కారుపై తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా సిద్ధరామయ్య ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. ఇద్దరు నేతలు రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగుతారు. ప్రభుత్వ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందన్నారు. కర్ణాటక మాజీ సీఎం బస్వరాజు బొమ్మై మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన వాగ్ధానాలకు, మంత్రి వర్గ భేటీ అనంతరం సిద్ధరామయ్య చేసిన ప్రకటనలకు పొంతన లేదన్నారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం సిద్ధరామయ్య కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పై మండిపడ్డారు. ఈ కామెంట్స్ కి కౌంటర్ గా బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. సీఎం ప్రకటనలు ప్రజలను నిరాశకు గురిచేశాయని బొమ్మై అన్నారు.

Also Read...

రూ.2,000 నోట్లను ప్రవేశ పెట్టడం ప్రధాని మోడీకి ఇష్టం లేదు: మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ

Next Story