- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : రెస్టారెంట్ లో సర్వీస్ ఛార్జెస్ ... హైకోర్ట్ ఆగ్రహం
రెస్టారెంట్స్ లో కస్టమర్లపై సర్వీస్ ఛార్జ్(Service Charges) వసూలు చేయడంపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : రెస్టారెంట్స్ లో కస్టమర్లపై సర్వీస్ ఛార్జ్(Service Charges) వసూలు చేయడంపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్ల బిల్లులో సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) శుక్రవారం తీర్పును వెలువరించింది. రెస్టారెంట్లు లేదా హోటళ్లలో కస్టమర్లు ఆహార బిల్లులపై సర్వీస్ చార్జీని చెల్లించడం పూర్తిగా స్వచ్ఛందం మాత్రమేనని, దీనిని తప్పనిసరి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హోటళ్లు మరియు రెస్టారెంట్లు తమ ఆహార బిల్లులపై సర్వీస్ చార్జీని వసూలు చేయకుండా నిషేధించే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మార్గదర్శకాలను సవాలు చేస్తూ రెస్టారెంట్లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) దాఖలు చేసిన పిటిషన్లో రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని వసూలు చేయడాన్ని నిషేధించే ఎటువంటి చట్టం లేదని వారు పేర్కొన్నారు. కోర్టు ఈ వాదనలను తిరస్కరించి, సర్వీస్ చార్జీ స్వచ్ఛందమనే నిర్ణయాన్ని ధృవీకరించింది.






