విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీలోకి జిన్నా ఆత్మ ప్రవేశిస్తుంది.. బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ

by Dishafeatures2 |
విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీలోకి జిన్నా ఆత్మ ప్రవేశిస్తుంది.. బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ సంచలన ఆరోపణలు చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీలోకి జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందని ఎద్దేవా చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడి భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రజలను వేధిస్తోందని అన్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలకు ముక్తార్ అబ్బాస్ నక్వీ కౌంటర్ ఇచ్చారు. విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీలోకి పాకిస్థాన్ జాతిపిత జిన్నా లేదంటే ఆల్ ఖైదా వ్యక్తులు ప్రవేశిస్తారని అన్నారు. ఇండియాకు రాగానే మంచి భూత వైద్యునికి చూపించుకోవాలని ఎద్దేవా చేశారు.

విదేశాల్లో భారత దేశ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రాహుల్ కాంట్రాక్టు తీసుకున్నారని ఆరోపించారు. పెద్ద రాజకీయ వారసత్వ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ కు మోడీ లాంటి సాధారణ వ్యక్తు పీఎం కావడం ఇష్టంలేదని, అందుకే మోడీని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ రాచరికానికి మోడీ అడ్డుగా ఉన్నారనే అక్కసుతోనే కాంగ్రెస్ పార్టీ మోడీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ముస్లింలను చీవింగ్ గమ్ లా వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని నక్వీ తీవ్ర విమర్శలు చేశారు.

Read more:

రాహుల్ పాల్గొన్న సభలో భారత జాతీయ గీతానికి ఘోర అవమానం (వీడియో)


Next Story

Most Viewed