- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమిలో రూ.1.64 కోట్ల నగదు పాతిపెట్టిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల అడ్డాగా భావించే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఒక పెద్ద మావోయిస్టు డంప్ను కనిపెట్టారు.

దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల అడ్డాగా భావించే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఒక పెద్ద మావోయిస్టు డంప్ను కనిపెట్టారు. ఈ క్రమంలో ఏకంగా రూ. 1.64 కోట్ల నగదుతో పాటు భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతకొద్ది రోజులుగా సరిహద్దు భద్రతా దళం (BSF), రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ కూంబింగ్లో బయటపడిన డంప్లో కేవలం నగదు మాత్రమే కాకుండా, యుద్ధ తంత్రాన్ని తలపించేలా భారీ ఆయుధ సామాగ్రి లభించింది.
బాంబుల తయారీకి ఉపయోగించే పరికరాలు..
ఇందులో శత్రువులను దెబ్బకొట్టే రాకెట్ లాంఛర్లు, అత్యాధునిక ఏకే-47 (AK-47) గన్లు, ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిల్స్, భారీగా విస్ఫోటక సామగ్రి, బాంబుల తయారీకి ఉపయోగించే పరికరాలు, మావోయిస్టుల సాహిత్యం, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో ఈ నగదు స్వాధీనం అత్యంత కీలకమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నగదును లెక్కించడానికి కౌంటింగ్ యంత్రాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బలగాలు అణువణువూ గాలిస్తున్నాయి. మావోయిస్టుల వ్యూహాలను చిత్తు చేస్తూ వారి ప్రధాన స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోంది.






