ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల పెంపు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-15 12:50:19  IST  )

సికింద్రాబాద్–తిరుపతి (Secunderabad to Tirupati) మార్గంలో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు (Vande Bharat Express) ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్–తిరుపతి (Secunderabad to Tirupati) మార్గంలో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు (Vande Bharat Express) ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టికెట్లకు భారీ డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో, రైల్వే అధికారులు ఈ రైలు బోగీల సంఖ్యను మరింత పెంచారు.

2023 ఏప్రిల్ 9న ప్రారంభమైన ఈ వందేభారత్ సేవ మొదట్లో 8 బోగీలతో ప్రయాణం ప్రారంభించింది. అయితే కొద్ది నెలల్లోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బోగీలను 16కి విస్తరించారు. తాజాగా డిమాండ్ మరింత పెరగడంతో బోగీల సంఖ్యను 20కి పెంచారు. దీంతో ఈ రైలు మొత్తం ప్రయాణికుల సామర్థ్యం 1,440 సీట్లకు చేరుకుంది.

ఇదే సమయంలో ఈ రైలు రూపురేఖల్లోనూ మార్పు తీసుకొచ్చారు. గతంలో తెలుపు రంగులో ఉన్న బోగీలను పూర్తిగా ఆరెంజ్ కలర్‌లోకి మార్చారు. కొత్త రంగు, పెరిగిన సామర్థ్యంతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తోంది.

Next Story