మొదటి భర్తతో విడాకులు.. ప్రియుడితో కలిసి రెండో భర్త మర్డర్.. ఐదుగురు పిల్లలను..

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. మొదటి భర్తతో విడిపోయిన రీనా.. ప్రదీప్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఈ-రిక్షా నడిపే ప్రదీప్‌తో పదేళ్లుగా బాగానే ఉంది. ఐదుగురు పిల్లలను గారాబంగా పెంచాడు ప్రదీప్. కానీ

మొదటి భర్తతో విడాకులు.. ప్రియుడితో కలిసి రెండో భర్త మర్డర్..  ఐదుగురు పిల్లలను..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. మొదటి భర్తతో విడిపోయిన రీనా.. ప్రదీప్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఈ-రిక్షా నడిపే ప్రదీప్‌తో పదేళ్లుగా బాగానే ఉంది. ఐదుగురు పిల్లలను గారాబంగా పెంచాడు ప్రదీప్. కానీ రీనా మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ప్రేమికుడు సలేక్‌ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. అతని అడ్డు తొలగించి మూడో పెళ్లి చేసుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే ప్రదీప్‌ను హత్య చేసిన రీనా.. శవాన్ని తోటలో పడేసింది. ప్రస్తుతం సలేక్, రీనా పోలీసుల అదుపులో ఉండగా.. ఈ కేసు స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ముఖ్యంగా ఐదుగురు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే బాధ వ్యక్తమవుతోంది.

Next Story