- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarnath: యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్
దీంతో యునెస్కో హెరిటేజ్ హోదా పొందిన 45వ భారతీయ ప్రదేశంగా సారనాథ్ నిలిచింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్లోని ప్రాచీన బౌద్ధ పుణ్యక్షేత్రం సారనాథ్కు ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో సారనాథ్ను అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. దీంతో యునెస్కో హెరిటేజ్ హోదా పొందిన 45వ భారతీయ ప్రదేశంగా సారనాథ్ నిలిచింది. వారణాసికి సమీపంలో ఉన్న ఈ చారిత్రక క్షేత్రం, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అనంతరం తన తొలి ధర్మోపదేశం చేసిన ప్రదేశంగా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని 'ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం'గా అభివర్ణించారు. భారత నాగరికత, ఆధ్యాత్మిక వారసత్వానికి ఇది ప్రపంచ గుర్తింపు అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, సారనాథ్కు లభించిన ఈ హోదా ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించడంతో పాటు బుద్ధుడి శాంతి, కరుణ, జ్ఞాన సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రపంచానికి చేరవేస్తుందని పేర్కొన్నారు.






