మెల్ బోర్న్‌లో రెచ్చిపోయిన ఖలిస్తానీ వర్గం.. భారతీయులపై దాడులు

by Dishanational4 |
మెల్ బోర్న్‌లో రెచ్చిపోయిన ఖలిస్తానీ వర్గం.. భారతీయులపై దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ సానుకూల వర్గం రెచ్చిపోయింది. మెల్ బోర్న్‌లోని ఫెడ్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాలు పట్టుకుని ఉన్న భారతీయులపై దాడులకు పాల్పడ్డారు. దీనిపై భారత్‌లోని ఆస్ట్రేలియన్ హైకమిషనర్ భారీ ఓ ఫరెల్ విచారం వ్యక్తం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా శాంతియుత నిరసనలకు కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ఎలాంటి హింసను సించబోమని చెప్పారు. ఇరు దేశాలు తమ తమ జాతీయ పర్వదినోత్సవాలను జరుపుకున్న వెంటనే ఈ సంఘటన చోటు చేసుకుందని అన్నారు. కాగా, దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ దాడిలో ఐదుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు హిందు దేవాలయాలపై ఖలిస్తానీ రాతలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీని‌ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

Next Story

Most Viewed