- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మోడీ హయాంలో ప్రజాస్వామ్యం విధ్వంసం

- పార్లమెంటులో చర్చలను అడ్డుకుంటోంది
- ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారు
- కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తోంది. సరైన చర్చలు జరగకుండా నిరోధిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలను ఉపయోగించి ఏ విధంగానైనా చర్చలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం పార్లమెంటులో చర్చలను అడ్డుకుంటోందని, ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని ప్రియాంక చెప్పారు. పార్లమెంటులో గత కొన్ని సమావేశాల్లో తాను పాల్గొని చూసింది ఏంటంటే.. ఏ విధంగానైనా చర్చలను నివారించడానికి ప్రతపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని సభలో మాట్లాడనీయకపోవడం ద్వారా సభలో గందరగోళం సృష్టిస్తుందని అన్నారు.
పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియ సమర్థవంతంగా పని చేయకుండా కేంద్రం ఆటంకం కలిగిస్తోందని, మోడీ హయాంలో ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందని అన్నారు. ప్రతిపక్షం తరచుగా పార్లమెంటు వ్యవహారాలను అడ్డగిస్తోందని ఆరోపిసప్తున్నారు. కానీ అసలు సభ సక్రమంగా జరగకుండా ఈ ప్రభుత్వమే అడ్డంకిగా మారిందని అన్నారు. బహుషా ఇది అందరికీ కొత్తగా కనిపిస్తుండొచ్చని అన్నారు. ప్రతిపక్షాల గొంతును అణచివేయడం అంటే ప్రజల వాయిస్ను వినకుండా చేయడమే అని ఆమె అన్నారు.