- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
S. Jaishankar on POK : పీఓకే భారత్లో భాగమే: జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో భాగమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇటీవల విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్లో మాట్లాడిన ఆయన, ఈ దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకే తిరిగి భారతదేశంలోకి వచ్చేలా చూడటానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. పీఓకే తిరిగి వచ్చేలా చూడటం మా జాతీయ నిబద్ధత. నాటి రాజకీయాల కారణంగా ఆర్టికల్ 370ని తొలగించలేమని ప్రజలు భావించారు, దీనిని తొలగిస్తే పెద్ద సమస్యలు వస్తాయని ప్రజల్లో భ్రమను కల్పించారు. కానీ ఒక్కసారి దానిని మార్చిన తర్వాత అక్కడి పరిస్థితి మొత్తం మారిపోయింది, మేము ఎట్టకేలకు 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య గురించి కూడా ప్రజలు ఆలోచించేందుకు అవకాశం లభించిందని జైశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు.
పీఓకే అంశాన్ని ప్రజలు మరిచిపోయేలా చేశారు, కానీ మేము మళ్లీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని విదేశాంగ మంత్రి అన్నారు. అంతకుముందు మే 5న జైశంకర్ మాట్లాడుతూ, పీఓకే భారతదేశంలో భాగమని, ప్రజలు దానిని మరచిపోయేలా చేశారని అన్నారు. ఒడిశాలోని కటక్లో జరిగిన ఒక కార్యక్రమంలో పీఓకే కోసం భారతదేశం ప్రణాళికలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓకే ఈ దేశం నుండి ఎన్నడూ బయటికి పోలేదు, ఇది ఈ దేశంలో భాగమని అన్నారు.