- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టర్కీలో భారత రాయబారిగా రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్.. ఉత్తర్వులు జారీ చేసిన విదేశాంగ శాఖ
దేశంలో దౌత్య వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకున్నది.

దిశ, వెబ్డెస్క్: భారత దౌత్య వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో (Republic of Turkiye) భారత తదుపరి రాయబారిగా (Ambassador of India) సీనియర్ ఐఎఫ్ఎస్ రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్ను నియమిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో (Iran) భారత రాయబారిగా విజయవంతంగా సేవలందిస్తున్నారు. పశ్చిమాసియా రాజకీయాలపై, అంతర్జాతీయ సంబంధాలపై మంచి పట్టున్న ఆయనను, ఇప్పుడు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన టర్కీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారత విదేశాంగ సర్వీస్ (IFS)లో సుదీర్ఘ అనుభవం ఉన్న రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్ త్వరలోనే టర్కీ రాజధాని అంకారాలో భారత రాయబారిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టర్కీతో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను (India-Turkiye Relations), వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషించనుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.






