- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులాంతర వివాహం చేసుకుంటే రూ.10 లక్షలు గిఫ్ట్ మనీ..
కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహం చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేసింది. కులాంతర వివాహం చేసుకుంటే చాలు వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జమచేయనుంది.
ఈ విషయాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ 2023 - 24 బడ్జెట్ సమావేశంలో ప్రకటించగా తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటారో ఆ జంటపేరుపై ప్రభుత్వం రూ.5 లక్షలను ఎనిమిదేళ్ల పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుందట. మిగిలిన రూ.5 లక్షలను కొత్తజంట ఉమ్మడి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు.
Next Story






