కులాంతర వివాహం చేసుకుంటే రూ.10 లక్షలు గిఫ్ట్ మనీ..

by Disha Web Desk 20 |
కులాంతర వివాహం చేసుకుంటే రూ.10 లక్షలు గిఫ్ట్ మనీ..
X

దిశ, వెబ్ డెస్క్ : కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహం చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేసింది. కులాంతర వివాహం చేసుకుంటే చాలు వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జమచేయనుంది.

ఈ విషయాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ 2023 - 24 బడ్జెట్ సమావేశంలో ప్రకటించగా తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటారో ఆ జంటపేరుపై ప్రభుత్వం రూ.5 లక్షలను ఎనిమిదేళ్ల పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుందట. మిగిలిన రూ.5 లక్షలను కొత్తజంట ఉమ్మడి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు.

Next Story