- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. CBI పిటిషన్పై స్పందించేందుకు గడువు మంజూరు
ఢిల్లీ మద్యం కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సీబీఐ పిటిషన్పై స్పందించేందుకు సమయం ఇవ్వాలన్న అభ్యర్థనకు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం కొంత సమయం ఇచ్చింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ (Discharge) ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు ఇవాళ కోర్టు గడువు పొడిగించింది. అయితే, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరారు. దీనిని సీబీఐ వ్యతిరేకించినప్పటికీ, కోర్టు ప్రతివాదులకు తమ వివరణ ఇచ్చుకోవడానికి అనుమతించింది.
అయితే, ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ను మార్చాలని కేజ్రీవాల్ గతంలో కోరారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ శర్మ గతంలో తమ బెయిల్ పిటిషన్లను తిరస్కరించినందున, ఆమె బెంచ్పై తమకు నమ్మకం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. కాగా, ఫిబ్రవరి 2026లో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్, సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని మద్యం కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తీర్పును వెలువరించింది. ఆ తీర్పు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇటీవలే సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతానికి హైకోర్టు విచారణను వాయిదా వేస్తూ.. నిందితులకు తమ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని సూచించింది.






