- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్లో దారుణం.. మరో వైద్యవిద్యార్థినిపై అత్యాచారం
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగిన హత్యాచార ఘటన ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగిన హత్యాచార ఘటన ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. ఆ తర్వాత మరో లా స్టూడెంట్ పై కూడా అత్యాచారం జరగడంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగాయి. తాజాగా మరో మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన 23 ఏళ్ల యువతి.. బెంగాల్ లోని దుర్గాపుర్ లో శోభాపుర్ సమీపంలోనున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం రాత్రి డిన్నర్ చేసేందుకు ఫ్రెండ్ తో కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లింది. వీరిని కొందరు దుండగులు వెంబడించగా.. స్నేహితుడు పరారయ్యాడు. బాధితురాలిని బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి.. ఒకడు అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కాలేజీ సిబ్బందిని విచారిస్తున్నారు. రాష్ట్రంలో తరచూ ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం ఇలాంటి ఘటనల్లో నిందితులపై కఠినంగా వ్యవహరించడంలో విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.






