Rajnath: సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ.. భద్రతా పరిస్థితులపై సమీక్ష

by vinod kumar |   ( Updated:2025-05-09 16:37:24.0  )
Rajnath: సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ.. భద్రతా పరిస్థితులపై సమీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) శుక్రవారం సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న దృష్యా దేశంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించినట్టు సమాచారం. పాక్ దాడులను తిప్పికొట్టడంపైనా తీవ్ర చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌ సహా ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన క్రమంలోనే ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ (Anil chowhan), ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra dhwivedi), ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ (Ap singh) , నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి పాల్గొన్నారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

భద్రతను కట్టుదిట్టం చేయాలి: అమిత్ షా ఆదేశాలు

సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలకమైన మౌలిక సదుపాయాలు, కీలక సంస్థల వద్ద భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF)ను ఆదేశించారు. యుద్ధ పరిస్థితుల దృష్యా బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్, సీఐఎస్ఎఫ్ డీజీలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, అంతరిక్ష పరిశోధనా సంస్థల వద్ద సెక్యురిటీ పెంచాలని సూచించారు.

READ MORE ...

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ ఉన్నతస్థాయి భేటీ




Next Story

Most Viewed