Raithu Bharosa Posters: ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ ఎదుట ‘రైతు భరోసా’ పోస్టర్ల కలకలం

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-07 03:12:35  IST  )

ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఎదుట ‘రైతు భరోసా యూటర్న్’ పేరిట పోస్టర్లు కనిపించడం కలకలం రేపుతోంది.

Raithu Bharosa Posters: ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ ఎదుట ‘రైతు భరోసా’ పోస్టర్ల కలకలం
X

దిశ వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్ (AICC Head Office) ఎదుట ‘రైతు భరోసా యూటర్న్’ (Raithu Bharosa U Turn) పేరిట పోస్టర్లు (Posters) కనిపించడం కలకలం రేపుతోంది. అయితే, ఆ పోస్టర్లలో ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ (Telangana)కు వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ (Warangal Raithu Declaration) పేరుతో రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరానికి పంట పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు చొప్పు ఇస్తామని వాగ్ధానం చేశారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు ఒక్క రూపాయి కూడా పంట పెట్టుబడి సాయం అందలేదని పోస్టర్ల సారాంశం. అయితే, ఆ పోస్టర్లను అంటించింది ఎవరు.. ఢిల్లీకి ఎలా వచ్చాయని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు.

Next Story