రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు... ఆ గ్రూపులే లక్ష్యంగా తనిఖీలు

by Dishanational1 |
రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు... ఆ గ్రూపులే లక్ష్యంగా తనిఖీలు
X

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. ఈ గ్రూపులకు సంబంధించిన కేసులో మంగళవారం ఎనిమిది రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో దాడులు చేసినట్లు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితమే పంజాబ్ కు చెందిన హర్వీందర్ సింగ్ సాంధును ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాంధుకు సంబంధించిన కేసుల్లో ఆరా తీసినట్లు పేర్కొన్నాయి. భారత్ లో ఉన్న కొన్ని క్రిమినల్ గ్యాంగులు విదేశాల నుంచి నిధులను పొందుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Next Story

Most Viewed