రాహుల్ అమేథీ ప్రజలను మోసం చేశారు: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

by Dishanational2 |
రాహుల్ అమేథీ ప్రజలను మోసం చేశారు: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ అమేథీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేరళలోని వయనాడ్ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు మద్దతుగా గురువారం నిర్వహించిన ర్యాలీలో స్మృతీ ఇరానీ పాల్గొని మాట్లాడారు. యూపీ ప్రజలను మోసం చేసిన రాహుల్ వయనాడ్‌లోనూ ఆ తరహా చర్యలకు పాల్పడేందుకే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 50ఏళ్ల పాటు కుటుంబ రాజకీయాల పేరుతో అమేథీని భ్రష్టు పట్టించారని చెప్పారు. రాహుల్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. పీఎఫ్ఐ వంటి తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించినప్పటికీ రాహుల్ వారి మద్దతు తీసుకోవడం చూసి ఆశ్యర్యపోయానన్నారు. ముస్లిం లీగ్ మద్దతు పొందడం కూడా సిగ్గుచేటని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కాగా, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ కేరళ రాష్ట్ర చీఫ్ సురేంద్రన్‌ను బరిలో నిలిపింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed