గెలిచినా ఓడినా దేశం కోసమే పని చేస్తాం: ప్రధాని నరేంద్ర మోడీ

by Web Desk |
గెలిచినా ఓడినా దేశం కోసమే పని చేస్తాం: ప్రధాని నరేంద్ర మోడీ
X

న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐదు రాష్ట్రాల్లో గెలుపు తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుందని, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో భాజపా గాలి వీస్తోందన్నారు. తాము గెలిచినా, ఓడినా దేశం కోసం పనిచేస్తామని, యూపీలో తాము ఓడిపోతామని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు ఆరోపణలు గానే మిగిలి పోతాయన్నారు. 2014,2017,2019 ఎన్నికల్లో యూపీలో భాజపాకు దక్కిన విజయాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించడానికే పనిచేసిందని విమర్శించారు. అంతేకాకుండా దేశంలో కుటుంబ పాలన చేసే పార్టీలను దూరం పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని పాటిస్తుందని, మిగతా రాజకీయ పార్టీలు భిన్నత్వ భావనను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటాయని వివరించారు.


Next Story

Most Viewed