అంతర్జాతీయ బౌద్ధ సదస్సు‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
అంతర్జాతీయ బౌద్ధ సదస్సు‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాక ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ బౌద్ధ సదస్సు‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ సదస్సు అశోక హోటల్‌లో రెండు రోజులపాటు జరగనుంది. దీనికి చైనా మినభా 30 దేశాల నుంచి బౌద్ధ ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే.. మెక్సికో, కంబోడియా, లావోస్, థాయ్‌లాండ్, జపాన్‌తో సహా విదేశాల నుండి 170 మందికి పైగా ప్రతినిధులు, భారత్ నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో బుద్ధ ధర్మం- శాంతి, బుద్ధ ధర్మం: పర్యావరణ సంక్షోభం, ఆరోగ్యం - సుస్థిరత, నలంద బౌద్ధ సంప్రదాయం - బౌద్ధ తీర్థయాత్రల పరిరక్షణ, జీవన వారసత్వం - అవశేషాలు అనే నాలుగు అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed